కాబూల్ : అఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించడంతో 26 మంది మృతి చెందారు. పూరి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆఫ్ఘన్లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి భూకంపం వచ్చింది. అలాగే ప్రావిన్స్లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ఇక బాద్గీస్ పశ్చిమ ప్రావిన్స్లోని ఖాదీస్ జిల్లాలో భూకంప తీవ్రతకు ఇండ్ల పైకప్పులు మీద పడటంతో.. 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ తెలిపారు మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm