ఢిల్లీ : ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం అరగంట ఆలస్యంగా అంటే 10:30 గంటలకు వేడుకలు మొదలవుతాయని రక్షణశాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణశాఖ పేర్కొంది. విమాన విన్యాసాలకు ఆ సమయం అనుకూలంగా ఉన్నందునే సమయంలో మార్పులు చేసినట్లు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm