హైదరాబాద్ : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నభూదాన్ పోచంపల్లి గ్రామం అరుదైన ఘనతను సాధించింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించిన ఉత్తమ పర్యాటక గ్రామం ప్రతిష్టాత్మక పోటీలో భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేసిన మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి.మనోహర్ రావులు సీఎం కేసీఆర్ ను కలిసారు. ఇందుకు సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారు అందుకున్నారు. టూరిజం శాఖ అధికారులు చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 06:40PM