హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి రూ.107 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.ప్రయాణికులకు ఆర్టీసి చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ లు కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగ సమయంలో ఆర్టీసిలో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామని ఆర్టీసి అధికారులు తెలిపారు. దాని ద్వారా ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. కరోనాకు ముందు ఆర్టీసికి రోజుకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేది. కానీ సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm