హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు వార్తల నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు. బుధవారం పార్టీ కార్యాలయాన్ని పోలీసులు పరిశీలించారు. కార్యాలయంలో భద్రత లోపాలను సరిచేసుకోవాలని సిబ్బందికి సూచించారు. నిరంతరం పార్టీ ఆఫీస్ దగ్గర సీఐ స్థాయి అధికారితో భద్రత పర్యవేక్షిస్తారని చెప్పారు. బీజేపీ ఆఫీస్ ముందు వాహనాలు నిలపరాదని ఆదేశించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అలెర్ట్ చేయాలని సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు ఆఫీసు సిబ్బంది అలెర్ట్గా ఉండాలని పోలీసులు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm