హైదరాబాద్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవలే భారత జట్టు వన్డే సారథిగా ఎంపికైన రోహిత్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దాంతో ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు.
అయితే బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ఆ జట్టు ఓపెనర్ మలన్(6).. బూమ్రా బౌలింగ్లో అవుటయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), మలన్, మార్క్రమ్, వాన్ డర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, పెహ్లూక్వయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షంసి, లుంగి ఎంగిడి.
భారత్ :కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2022 02:25PM