హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని ఎస్ బావర్చి హోటల్ లో తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. హోటల్లో పలువురు బాలకార్మికులతో పని చేయిస్తున్నారంటూ సమాచారం రావడంతో స్మైల్ టీం అధికారులు తనిఖీలకు వెళ్లారు. అయితే అధికారులపై అక్కడి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దాంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని హోటల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm