- నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..గొప్ప అవకాశం కల్పించిన టిఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా నాపై, నా అభ్యర్థిత్వంపై ఎనలేని విశ్వాసం ప్రదర్శించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా బోధన్ ఎమ్మెల్యే షకీల్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2022 03:04PM