అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం రామచంద్రాపురంలో సర్పంచ్ వెంకటరమణమూర్తిపై హత్యయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మరురానగర్లోని సర్పంచ్ కోసం సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ.. ఇద్దరు వ్యక్తులను తీసుకుని వెళ్లింది. సర్పంచ్తో మహిళ మాట్లాడుతున్న సమయంలోౌ ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో సర్పంచ్పై కాల్పులు జరిపారు. తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వెంకటరమణకు తీవ్రగాయాలు కావడంతో ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm