నిర్మల్ : ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లాల్ వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm