హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూౌ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్ తాజాగా నియమితులయ్యారు. మొత్తం 13 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీచేయగా అందులో శశాంక్ గోయల్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm