హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో ఆవుకు ఆపరేషన్ చేసి దాని కడుపులోని 20 కిలోల ప్లాస్టిక్ను తొలగించారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. మండలంలోని అడేగామకే గ్రామానికి చెందిన ఆశన్నకు చెందిన రైతు ఆవు కడుపు ఉబ్బింది. దాంతో ఆవును పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా పశువైద్యాధికారి గోవింద్ నాయక్ దాన్ని పరిశీలించారు. ఆపు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆవుకు ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ను బయటకు తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm