ముంబై : వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై పత్రికూల ప్రభావాన్ని చూపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం కూడా కారణం అని తెలుస్తోంది. చివరికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి పడిపోయింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి దిగజారింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.43 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో షేర్లు ఎక్కువగా నష్టపోతే.. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హిండాల్కో, యుపీఎల్ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి.
Mon Jan 19, 2015 06:51 pm