హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి పడిపోయింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి దిగజారింది.
Mon Jan 19, 2015 06:51 pm