హైదరాబాద్ : చిన్నజియర్ స్వామి మాటలు మధ్య యుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కులాలను నిర్మూలించడం తగదని చిన్నజియర్ స్వామి ఇటీవల అన్నారని అన్నారు. ఏ కులం వారు ఆ కులం పని చేయాలని ఆయన చెప్పారని తెలిపారు. అలాగే మాంసాహారులు ఏం మాంసం తింటారో ఆ జంతువుల మాదిరే వ్యవహరిస్తారని ఆయన చెప్పారని విమర్శించారు. జీయర్ మాటలు మధ్య యుగాన్ని గుర్తుకు తెస్తున్నాయ న్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రామానుజాచార్యుల విగ్రహానికి ఃసమానత్వ ప్రతిమః అని పేరు పెట్టడం విడ్డూరంగా ఉందనిఅన్నారు. చిన్నజీయర్ ప్రవచనాలు బహుజనుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తి తలపెట్టిన కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని రావడం భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm