హైదరాబాద్ : ఓ బాలికపై ఆమె తండ్రి, సోదరుడే మూడేండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న దారుణ ఘటన మహారాష్టల్రో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. ముంబయిలోని ధారావిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్యాక్టరీలో బాలికపై ఆమె తండ్రి లైంగికంగా హింసించాడు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న బాలికపై ఆమె అన్న కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలుమార్లు దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఇన్నాళ్లు వారి వేధింపులు భరించిన బాలిక చివరికి తన పాఠశాలోని ప్రధానోపాధ్యాయురాలికి విషయం తెలిపింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధతురాలి తండ్రి (43), సోదరుడి(20)పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm