హైదరాబాద్: తెలంగాణలోని పీజీ వైద్య కళాశాలల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల పెంపును హైకోర్టు కొట్టివేసింది. ప్రయివేటు వైద్య కళాశాలల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అయితే టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులను పెంచిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో విచారించిన కోర్టు.. పీజీ వైద్య ఫీజుల పెంపును కొట్టివేస్తూ సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. 2016-19కి టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని, అలాగే కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కళాశాలలను హైకోర్టు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm