న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేండ్లలోపు చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. అలాగే ఆరేండ్ల నుంచి 11 ఏండ్ల వయస్సు పిల్లలకు తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. ఇక 12 ఏండ్లు కంటే ఎక్కువున్న వారికి మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఇతర దేశాల నుంచి అందుబాటులో ఉన్న డేటా వివరాల ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని, కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దని కేంద్రం సూచించింది. స్టెరాయిడ్స్ను సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో వాడాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 03:22PM