అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు సచివాలయ ఉద్యోగిని ప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. దాంతో ఆమెను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని కొందరు వైసీపీ మద్దతుదారులు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్లకు గోతాలు ఇవ్వాలని తనను ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. దాంతో వారి బెదిరింపులు ఒత్తిళ్లు భరించలేక, ఆడపిల్లగా ఏమీ చేయలేక పురుగుల మందు తాగినట్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm