న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏదైనా సాధించగలం అనే నేతాజీ నినాదాన్ని ప్రేరణగా తీసుకోవాలని తెలిపారు. నేతాజీ ప్రేరణతో దేశసేవకు అంకితం కావాలని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని స్థాపించి దేశం కోసం సాహసం, పరాక్రమం చూపారని అన్నారు. నేతాజీ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించారని ప్రధాని కొనియాడారు. నేతాజీతో ముడిపడి ఉన్న అన్ని ప్రదేశాలను స్మారక ప్రదేశాలుగా మారుస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm