హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య రావటంతో కుటుంబ సభ్యులు పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు. టెలివిజన్ కార్యక్రమాల్లో వార ఫలాలు చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువైన విషయం తెలిసిందే. సిద్ధాంతి చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా విశ్వసిస్తుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm