హైదరాబాద్ : ప్రేమ పేరుతో ఓ వివాహితుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఏలూరులో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని పాములదిబ్బకు చెందిన వివాహితుడు వెంకయ్య ప్రేమించాలి అంటూ గత కొద్దీ రోజుల నుంచి వేధింపులకు గురిచేశాడు. అయితే వేధింపులు తీవ్రం కావడంతో బాధిత బాలిక కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm