హైదరాబాద్ : తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ సంఘం-2022 డైరీని హరీశ్రావు ఆదివారం ఆవిష్కరించారు. విద్యకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. రూ.7,289 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సంఘం ప్రతినిధి కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm