హైదరాబాద్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి ధర ఒక్కసారిగా తగ్గడంతో కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు కావాలనే ధరలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. సీజన్ ప్రారంభంలో 18 వేల 600 రూపాయలు పలికిన మిర్చి ధర... ప్రస్తుతం మార్కెట్లో 17 వేల 200కు పడిపోయిందని నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. పెట్టుబడులు గతంతో పోలిస్తే.. రెండింతలు అయ్యాయని వాపోయారు. రైతుల ఆందోళనతో అప్రమత్తమైన అధికారులు.. వ్యాపారులతో చర్చలకు దిగారు. రైతుల ఆందోళనలతో మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు అక్కడిక్కడే నిలిచిపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm