మంచిర్యాల: జిల్లాలోని నస్పూర్లోని అల్లూరి సీతారామరాజు నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య అలేఖ్యను భర్త కొట్టి చంపాడు. అనంతరం పోలీసులకు నిందితుడు విజయ్కుమార్ లొంగిపోయారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm