హైదరాబాద్ : 'ఉప్పెన' సినిమాతో తొలి ప్రయత్నంలోనే భారీ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్, ఆ తరువాత 'కొండ పొలం' సినిమాతోను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మూడో సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొంతసేపటి క్రితమే టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ కనిపించనుంది. 'రొమాంటిక్' .. 'లక్ష్య' తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది. టైటిల్ తో .. రొమాంటిక్ సీన్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm