హైదరాబాద్: వ్యూహం ప్రకారం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణలో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు.. దేశంలో రేపు అమలు అవుతున్నాయన్నారు. మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుందన్నారు. కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని, తెలంగాణ ఏర్పాటు కాగానే రూ. 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అంటే... జీహెచ్ఎంసీ ఒక్కటే కాదని, ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్గా గుర్తించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm