హైదరాబాద్ : ఏపీలో సీఎం జగన్ నూతన పథకానికి ప్రారంభించారు. అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనందించే ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఏటా రూ. 15 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. అందుకోసం నేడు రూ. 589 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 3,92,674 మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2022 02:29PM