వరంగల్ : తెలంగాణలో మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బదిలీతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయుడు విషం తాగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల రమేష్ ఖానాపూర్ మండలం, ధర్మారావుపేట సమీపంలో బాల్ తండాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.తాజా బదిలీల్లో ఆయనకు ములుగు జిల్లాకు బదిలీ అయింది. దాంతో కుటుంబాన్ని విడిచి వెళ్లలేక, ఆరోగ్యం సహకరించక, తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం పాఠశాల వద్దే పురుగుల మందు తాగాడు. నర్సంపేటలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm