హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ ను చినజీయర్ స్వామి మంగళశారం కలిశారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో నిర్వహించే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ ను చినజీయర్ స్వామి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చినజీయర్ మాట్లాడుతూ.. సమతామూర్తి పేరిట 214 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 13న ఆ విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm