హైదరాబాద్ : రైల్వే , మెట్రోలో జాబ్స్ అంటూ రూ. కోటి 50 లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాకరపర్తి సురేంద్ర అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. అతని భార్య బానోతు నాగలక్ష్మి, మరో వ్యక్తి దాచిపల్లి సురేష్ లు సురేంద్రకు సహకరించేవారు. గతంలో సురేంద్ర తన స్నేహితులకే నకిలీ గోల్డ్ బిస్కెట్స్ అమ్ముతున్న కేసులో ప్రధాన నిందితుడు. 2013 లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చిన సురేంద్ర పుట్ట సురేష్ రెడ్డి గా పేరు మార్చుకున్నాడు. ప్రయివేటు కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్స్ తో చాలా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసేవాడు.
అనంతరం రూ. 10 లక్షలు ఇస్తే, రైల్వే లో, మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను సురేందర్ నమ్మించేవాడు. అతనికి అతని భార్య భార్య బానోతు నాగలక్ష్మి, దాచిపల్లి సురేష్ లు సహకరించారు. అలా నిరుద్యోగుల నుంచి వీరు రూ. కోటి 50 లక్షలకు పైగా వసూలు చేశారు.తర్వాత ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి వారిని నమ్మించారు. వచ్చిన డబ్బుతో వాళ్ళ అమ్మ పేరు మీద ఉప్పల్ లో ఒక ప్లాట్, ట్రావెల్స్ ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ, జడ్చర్లలో కాంటీన్ లు ఓపెన్ చేశాడు. విషయం తెలసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక మహీంద్రా జైలో, రెండు టెంపో ట్రావెలర్ వెహికల్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ అప్పోయింట్మెంట్ లెటర్స్, మెట్రో స్లాట్ లెటర్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2022 04:07PM