అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అశోక్ బాబుపై కేసును సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో అఫిడవిట్ లో అవాస్తవాలు పేర్కొన్నారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆయన బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలిపారు.రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేశారు. అశోక్ బాబు గతంలో ఏసీటీవో ఉద్యోగం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm