న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు (60ఏళ్లు పైబడినవారు) ఉన్నారని చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm