హైదరాబాద్: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మార్చురీ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్ రాక మనస్తాపంతో రైలు కింద పడి మరణించిన సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి, కాంగ్రెస్, సీపీఐ, పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మార్చురీ వద్ద నాయకులు భారీ ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాగర్ ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని నాయకులు ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm