అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వైసీపీ, టీడీపీలతో బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కోసం ఏపీలోని ప్రధాన పార్టీలు యత్నిస్తున్నాయని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తమకు సత్సంబంధాలున్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగానే వైసీపీ నేతలతో మోడీ కలుస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా బీజేపీతో పొత్తు అంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm