సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబంలోని ఆరుగురు ఆటోలో మెదక్ జిల్లాలోని తూప్రాన్కు ఓ కార్యక్రమానికి వెళ్తున్నది. ఈ క్రమంలో జగదేవపూర్ మండలం అలిరాజ్పేట్ బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దాంతో ఆటోలో ఉన్న కనకయ్య, కవితలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురు క్షతగాత్రులను గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరో ఇద్దరు చనిపోయారు. మిగిలినవారిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm