అహ్మదాబాద్ : గుజరాత్ లోని కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ సమీపంలో భారీగా కోకైన్ ను పట్టుకున్నారు. ఓ కంటైనర్లో సుమారు 56 కిలోల కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ500 కోట్లకుపైగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
ఇంతకు ముందు జిల్లాలోని కాండ్లా పోర్ట్ సమీపంలోని కంటైనర్ స్టేషన్లో డీఆర్ఐ అధికారులు దాడులు జరిపి రూ.1300కోట్ల విలువైన 260 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 06:20PM