హైదరాబాద్ : పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. అతని భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషాదం ఘటన సంగారెడ్డి జిల్లాలో కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాట్రోత్ జగన్ (40) అతని భార్య కాట్రోత్ మారోనిలు వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా కప్పడానికి చేను వద్దకు వెళ్లారు. అయితే ఆ సమయంలో వారిపై పిడుగు పడటంతో జగన్ అక్కడికక్కెడే మృతిచెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm