కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లని కోల్ కతాలో ప్రస్తుతం ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ లు జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియం లోపలకి వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) మధ్య మ్యాచ్ సందర్భంగా కోల్కతా పోలీసులు స్టేడియం ఆవరణలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అనికేత్ కుమార్, సునీల్ కుమార్ , ఓబాడ ఖలీల్ లుగా గుర్తించారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో, అమర్ కుమార్ మహ్తో , అజయ్ కుమార్ అనే మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బీహార్లోని దర్భంగా జిల్లా లహరియా సరాయ్కు చెందినవారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm