హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్లో మెట్రో రైలు సాంకేతిక సమస్యతో ట్రాక్పై నిలిచిపోయింది. దాంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో కారిడార్లో మోట్రో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడిచినట్టు తెలిసింది. దాంతో ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ నేపథ్యలో స్టేషన్లలో రద్దీ నెలకొంది. లక్డీకపూల్ స్టేషన్ ముందు 35 నిమిషాలు ఆగిన మెట్రో రైలును మెల్లగా స్టేషన్ చేర్చి.. రైలులో సమస్య వచ్చిందని ప్రయాణికులను అధికారులు దించేశారు. రెండ్రోజుల క్రితం కూడా ముసారాంబాగ్ స్టేషన్లో కూడా సాంకేతిక కారణంతో రైలు ఆగింది. ఇలా వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm