చెన్నై : దేశంలో మూఢనమ్మకాలు ఇంకా ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా చేతబడి జరిగిందనే అనుమానంతో మహిళలను ఓ పూజారి కొరడా దెబ్బలతో హింసించిన ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లా నరైకినర్ గ్రామంలో వెలుగుచూసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకెళ్తే.. నరైకినర్ గ్రామంలో వరరాజపెరుమాళ్ చెల్లిఅమ్మన్ మరియమ్మన్ ఆలయంలో 20 ఏండ్ల తర్వాత ఆలయ ఉత్సవాలు జరుగుతుండగా చూసేందుకు చుట్టుపక్కల 18 గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే చేతబడి జరిగిందనే అనుమానంతో ఓ పూజారి కొరడాతో మహిళలను కొడుతున్నాడు. పూజారి మహిళలను కొడుతుండగా మిగితా వారు చప్పట్లు, ఈలలు వేయడం గమనార్హం. ఆ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 02:22PM