హైదరాబాద్ : తాను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్ దే అవుతుందని దర్శకుడు, రచయిత, సినీ నటుడు, పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామరావు 99వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. అలాగే ఎన్టీఆర్ పుస్తకాన్ని దగ్గుబాటి పురందేశ్వరి, పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో పాటు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తమ అన్నదమ్ములకు పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్పై ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఆ పుస్తకమే తన చివరిదని తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం బాధ కలిగించేదన్నారు. వందేండ్ల తర్వాత అయినా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం ఆనందంగా ఉందనన్నారు. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ పేరు పెట్టేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 02:47PM