లక్నో : ఓ వర్గం బాలుడిని బలవంతంగా మతమార్పిడి చేసి ఓ మహిళతో పెండ్లి చేసిన మహిళ, ఆమె తల్లిదండ్రులు, మత గురువులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
స్వరాజ్యానికి చెందిన జర్నలిస్ట్ స్వాతి గోయెల్ శర్మ మే 24న ఓ వీడియోను పంచుకున్నారు, దీనిలో మతగురువు 16 ఏండ్ల బాలుడిని మతం మార్చి పెండ్లి చేస్తున్నట్టు గా ఉంది. బాలుడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన విడాకులు తీసుకున్న ఓ మహిళ ఆ బాలుడిని బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అతడిని బలవంతంగా వేరే మతంలోకి మార్చారు. బాలుడు మతం మారిన తర్వాత మొహమ్మద్ హనీఫ్ కుమార్తె సిమ్రాన్తో పెండ్లి చేశారు. సిమ్రాన్కు ఇప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపిసి సెక్షన్లు 363 మరియు 342 కింద కాకడియో పిఎస్లో ఎఫ్ఐఆర్ (నంబర్ 117) దాఖలు చేశారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 03:16PM