హైదరాబాద్ : తన సంతకాన్ని నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ చేశారంటూ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన సీఐ నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.ఆయన మాట్టాడుతూ.. 'మా ఇష్టం` సినిమా షూటింగ్ సమయంలో తన సంతకాన్ని నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 2020 నవంబర్ 30న తన లెటర్ హెడ్ తీసుకున్నారని... ఆ తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిపారు. వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని చెప్పారు. ఈ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వాస్తవాలను తేల్చాలని కోరారు. తన సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉందని... కానీ నకిలీ ప్రతాలతో కేసులు వేసి సినిమా విడుదలను అడ్డుకున్నారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm