అమరావతి : లంచం తీసుకున్న కేసులో కర్నూలు జిల్లా వెల్దుర్తి సీఐ మహేశ్వరరెడ్డిను ఉన్నాతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం సీఐ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఏఎస్ఐ ఖాదర్వలి రూ. 40 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. అయితే
ఈ కేసులో సీఐ మహేశ్వరరెడ్డి.. ఏఎస్సై ద్వారా లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏసీబీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారించిన అధికారులు సీఐపై వేటు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 03:30PM