చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. చెన్నై శివారు ప్రాంతమైన పోజిచలూరు పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వారి ఇంట్లో శవమై కనిపించడంతో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారంతో తమిళనాడు పోలీసులు ఈ ఉదయం పొజిచలూరులో ఓ ఇంట్లో ఒక వ్యక్తి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తి తన భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేద మందుల దుకాణం నడుపుతున్న ప్రకాష్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అతను పోర్టబుల్ కట్టర్ ఉపయోగించి తన భార్య గాయత్రి (35), కుమారుడు హరికృష్ణన్ (11), కుమార్తె నిత్యశ్రీ (9) గొంతకోయడంతో వారు మృతి చెందారని తెలుస్తోంది. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. శంకర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 03:36PM