లండన్ : రానున్న కాలంలో సూపర్ సైక్లోన్ల వల్ల రానున్న భారత్కు తీవ్ర ముప్పు పొంచి ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ మేరకు వారు ఒక నివేదికలో వివరాలను వెల్లడించారు. 2020లో విరుచుకుపడ్డ అంఫన్ సూపర్ సైక్లోన్ తీవ్రత పెరుగడానికి గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమని పరిశోధకులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి డాటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు తాజాగా ఈ అంచనాకు వచ్చారు. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల మోతాదు ఇలాగే కొనసాగితే, అంఫన్ సృష్టించిన బీభత్సం కంటే 250 శాతం ఎక్కువ తీవ్రతతో భారత ప్రజలు ప్రభావితం కావొచ్చని హెచ్చరించారు. ఒక మీటరు కంటే ఎక్కువ స్థాయిలో వరదలు విరుచుకుపడవచ్చని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm