నిజామాబాద్ : పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా చందూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ అనే బాలుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అయితే పరీక్షలు జరుగుతున్న క్రమంలో శనివారం అతను కారేగాం నుంచి బిర్కూర్కు పరీక్ష రాసేందుకు వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో చందూర్ శివారు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టిందది. దాంతో వికాస్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm