అమరావతి : భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె మెడ నరికి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వరలక్ష్మి, కనకరాజులు భార్య భర్తలు. గత కొన్ని రోజులుగా భార్యపై భర్తకు అనుమానం పెరగడంతో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం కూడా భర్త తన భార్యపై అనుమానంతో ఆమె మెడ నరికాడు. అనంతరం అతను చేయికోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు.. వరలక్ష్మిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm