హైదరాబాద్: జూన్ 3వ తేదీ నుంచి చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగించుకోవాలన్నారు.
పల్లె ప్రగతిలో 20 పంచాయతీలు గుర్తింపు పొందగా అందులో 19 పంచాయతీలు జనగామ జిల్లాలో ఉండటం గర్వకారణమని చెప్పారు. పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 04:26PM